News April 5, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.*శ్రీ రామ నవమికి 8టన్నుల బెల్లాన్ని వితరణ చేసిన దెందులూరు MLA.* చింతలపూడిలో దంచి కొట్టిన వర్షం..నేలకొరిగిన చెట్లు.*cm పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, మంత్రి.*2024, 25 రబీ పంట కాలానికి ధాన్యం సేకరణ ప్రారంభం.*ఆటో నగర్లో స్థలాలు ఇవ్వాలని మెకానిక్‌ల సమావేశం.

Similar News

News April 19, 2025

ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

image

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్(ఫొటోలో) మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రారంభం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.

News April 19, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్(సెషన్-2) ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ రిలీజ్ చేసిన NTA అధికారులు తాజాగా విద్యార్థుల పర్సంటైల్ స్కోరులో ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్లో ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, అందులో తెలుగువారు నలుగురు ఉన్నారు.

News April 19, 2025

సంగారెడ్డి: 21న పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

image

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో 21న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి శుక్రవారం తెలిపారు. జాబ్ మేళాలో ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!