News April 5, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.*శ్రీ రామ నవమికి 8టన్నుల బెల్లాన్ని వితరణ చేసిన దెందులూరు MLA.* చింతలపూడిలో దంచి కొట్టిన వర్షం..నేలకొరిగిన చెట్లు.*cm పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, మంత్రి.*2024, 25 రబీ పంట కాలానికి ధాన్యం సేకరణ ప్రారంభం.*ఆటో నగర్లో స్థలాలు ఇవ్వాలని మెకానిక్ల సమావేశం.
Similar News
News November 28, 2025
SCలకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు జీవో

AP: SC ఉద్యోగులకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉపకులాలకూ న్యాయం చేయడానికి 3గ్రూపులుగా విభజించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం గ్రూప్-1 కింద రెల్లి కులాలకు 1%, గ్రూప్-2లో మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్-3లో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తింపజేయనుంది. కేడర్ స్ట్రెంత్ 5 కంటే ఎక్కవ ఉన్నచోట ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రతి గ్రూపులో మహిళలకు 33.33% సమాంతర రిజర్వేషన్ ఉంటుంది.
News November 28, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 28, 2025
2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు!

TG: రాష్ట్రంలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు RTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.


