News April 5, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.*శ్రీ రామ నవమికి 8టన్నుల బెల్లాన్ని వితరణ చేసిన దెందులూరు MLA.* చింతలపూడిలో దంచి కొట్టిన వర్షం..నేలకొరిగిన చెట్లు.*cm పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, మంత్రి.*2024, 25 రబీ పంట కాలానికి ధాన్యం సేకరణ ప్రారంభం.*ఆటో నగర్లో స్థలాలు ఇవ్వాలని మెకానిక్‌ల సమావేశం.

Similar News

News November 7, 2025

త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

image

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి తిరుపతి జిల్లాలో స్కూళ్లకు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో కుమార్ వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

News November 7, 2025

తొర్రేడు: తండ్రిని హతమార్చిన తనయుడు

image

రాజమండ్రి మండలం తొర్రేడులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కూతురు వివాహం విషయంలో తండ్రి అప్పారావును కొడుకు వడిశెల సాయికుమార్ దారుణంగా హత్య చేశాడని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ గురువారం రాత్రి తెలిపారు. పెళ్లి విషయంలో చెల్లెలిని తండ్రి తిట్టడంతో కోపోద్రిక్తుడైన సాయికుమార్ కూరగాయలు కోసే కత్తితో అప్పారావు పీక కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. సాయికుమార్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.