News April 1, 2025

ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10 పబ్లిక్ పరీక్షలు

image

ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పబ్లిక్ పరీక్షకు రెగ్యులర్ స్టూడెంట్స్ 22,704 హాజరు కావలసి ఉండగా 22,244 హాజరు అయ్యారని 460 మంది గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ 295 మందికి 169 మంది హాజరయ్యారని, 126 గైర్హాజరు అయ్యారని స్పష్టం చేశారు. మొత్తం 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. 

Similar News

News October 24, 2025

మెదక్: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

image

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన బాయికాడి రాజమణికి కౌడిపల్లి బస్టాండ్‌ వద్ద బస్సులో గుండెపోటు వచ్చింది. బంధువులు కౌడిపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

News October 24, 2025

‘మోడల్ సోలార్‌ విలేజ్‌’గా మరికల్‌

image

సూర్య ఘర్‌ ముఫ్త్ బిజిలీ యోజన (పీఎంఎస్‌జీ ఎంబీవై) పథకం కింద మరికల్‌ గ్రామం ‘మోడల్‌ సోలార్‌ విలేజ్‌’గా ఎంపికైందని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. నారాయణపేట కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మరికల్‌ను సోలార్‌ విలేజ్‌గా మార్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి డీపీఆర్‌ (DPR) సిద్ధం చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

News October 24, 2025

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే “పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే” కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని సిబ్బంది నుంచి వచ్చిన 8 వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ తెలిపారు. సమస్యలు పరిష్కారమైతేనే వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన అన్నారు.