News April 1, 2025
ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10 పబ్లిక్ పరీక్షలు

ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పబ్లిక్ పరీక్షకు రెగ్యులర్ స్టూడెంట్స్ 22,704 హాజరు కావలసి ఉండగా 22,244 హాజరు అయ్యారని 460 మంది గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ 295 మందికి 169 మంది హాజరయ్యారని, 126 గైర్హాజరు అయ్యారని స్పష్టం చేశారు. మొత్తం 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామన్నారు.
Similar News
News December 7, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 7, 2025
సర్పంచ్గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It
News December 7, 2025
నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం

నూజివీడులో ట్రిపుల్ ఐటీలో చదువుతున్న బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టడీ క్లాస్ నుంచి హాస్టల్ కు వెళ్లవలసిన బాలిక కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. బాలిక అదృశ్యంపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూజివీడు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


