News April 1, 2025

ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10 పబ్లిక్ పరీక్షలు

image

ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పబ్లిక్ పరీక్షకు రెగ్యులర్ స్టూడెంట్స్ 22,704 హాజరు కావలసి ఉండగా 22,244 హాజరు అయ్యారని 460 మంది గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ 295 మందికి 169 మంది హాజరయ్యారని, 126 గైర్హాజరు అయ్యారని స్పష్టం చేశారు. మొత్తం 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. 

Similar News

News December 16, 2025

వరంగల్: లోకల్ పోరులో లోకల్ పొత్తులు!

image

3వ దశ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్, BJP బలపరచిన వాళ్లు ఒక్కటయ్యారు. శాయంపేట మండలంలో కాంగ్రెస్‌కు BRS అభ్యర్థి మద్దతు పలికారు. శాయంపేట పంచాయతీ బరిలో ఉన్న BRS అభ్యర్థి రమాదేవి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి హై డ్రామాకు తెర తీశారు. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ రెబెల్ మధ్య పోటీ జరుగుతోంది. గీసుకొండ(M) కొమ్మాలలో BRS అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది.

News December 16, 2025

విజయ్ దివస్‌.. యుద్ధ వీరులకు మోదీ, రాజ్‌నాథ్ నివాళులు

image

1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భారత్‌కు విజయాన్ని అందించిన సాయుధ దళాలను ‘విజయ్ దివస్’ సందర్భంగా PM మోదీ స్మరించుకున్నారు. ఇది దేశ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగాలు దేశాన్ని కాపాడాయని, ఈ విజయం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని Xలో ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తూ.. ఈ విజయం త్రివిధ దళాల సమన్వయానికి ప్రతీక అని అన్నారు.

News December 16, 2025

అమెనోరియా సమస్యకు కారణమిదే!

image

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.