News April 1, 2025

ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10 పబ్లిక్ పరీక్షలు

image

ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పబ్లిక్ పరీక్షకు రెగ్యులర్ స్టూడెంట్స్ 22,704 హాజరు కావలసి ఉండగా 22,244 హాజరు అయ్యారని 460 మంది గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ 295 మందికి 169 మంది హాజరయ్యారని, 126 గైర్హాజరు అయ్యారని స్పష్టం చేశారు. మొత్తం 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. 

Similar News

News December 3, 2025

భద్రాచలం MLA అభ్యర్థి.. సర్పంచ్ పదవికి నామినేషన్

image

భద్రాచలం సర్పంచ్ బరిలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న మానే రామకృష్ణ నిలవడంతో అందరి దృష్టి ఆయనపైనే ఉంది. వీఆర్‌వో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన రామకృష్ణ, 2014లో భద్రాచలం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 10 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2 సార్లు అసెంబ్లీ టికెట్ దక్కకపోయినా, పార్టీ అధిష్టానం సూచన మేరకు ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రంగప్రవేశం చేశారు.

News December 3, 2025

RGM: మఫ్టీలో షీ టీమ్స్.. ఆకతాయిల ఆటకట్టు

image

RGM కమిషనరేట్‌ పరిధిలో మహిళల భద్రత కోసం షీ టీంలు మఫ్టీలో నిఘా పెంచాయని CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్కూల్‌లు, కాలేజీలు, బస్టాండ్‌ల వద్ద మహిళలు ఇబ్బందులు పడకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. NOVలో 68 పిటిషన్లు స్వీకరించి, 4 FIRలు, 9 పెట్టీ కేసులు, 28 కౌన్సిలింగ్‌లు నిర్వహించామన్నారు. డీకాయ్ ఆపరేషన్లలో 60మందిని పట్టుకున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా షీ టీం నంబర్లను సంప్రదించాలన్నారు.

News December 3, 2025

KNR: అభివృద్ధి చేయకపోతే ఏడాదిలో రాజీనామా చేస్తా: అభ్యర్థి

image

గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే సంవత్సరంలో రాజీనామా చేస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చిన వైనం KNR(D) శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. మం.లోని కేశవపట్నంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన అభ్యర్థి సముద్రాల సంపత్ గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తీర్చుతానని లేదంటే రాజీనామా చేస్తానని హామీపత్రం రాసిచ్చాడు. కోతుల సమస్య, ఖబరస్తాన్‌కి లైటింగ్, ఆటో యూనియన్‌ సంఘం భవన నిర్మాణం సహా అనేక హామీలను సంపత్ ప్రకటించాడు.