News February 26, 2026
ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

ఏలూరు జిల్లావ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,357 మంది విద్యార్థులకు గాను 15,972 మంది హాజరుకాగా, 385 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 98 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పటిష్ట నిఘా ఏర్పాటు చేశాయి.
Similar News
News April 19, 2026
మెళియాపుట్టి: భర్త చితికి నిప్పుపెట్టిన భార్య

ఇంటి యజమాని మృతి చెందిన బాధను దిగమింగుతూ భార్య, భర్తకు తలకొరివి పెట్టిన ఘటన మెళియాపుట్టి(మ) చాపరలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు..చాపరలో నివసిస్తున్న కృష్ణ(52) పెట్రోల్ బంక్లో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడగా..శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పిల్లలు చిన్నవారు కాగా..భర్త మరణంతో కన్నీరుమున్నీరువుతూ ఆయన చితికి భార్య నిప్పుపెట్టింది.
News April 19, 2026
భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయంలో ఆదివారం మొదటి రోజు శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. అందులో భాగంగా ఉదయం అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూర్ణాభిషేకం చేశారు. అనంతరం గణపతి హోమం, సుదర్శన హోమం, చండీ హోమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.


