News December 4, 2024
ఏలూరు జిల్లాలో భూ ప్రకంపనలు

ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, వేలూరుపాడు, చింతలపూడి, ద్వారకాతిరుమల తదితర చోట్ల ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసమవ్వడంతో.. బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. అయితే ఎక్కడా ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News October 20, 2025
భీమవరం: నేడు పీజీఆర్ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 20, 2025
పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
News October 19, 2025
పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.