News December 27, 2024

ఏలూరు జిల్లాలో రూ. 92.02 కోట్లు మంజూరు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.92.02 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల్లో రహదారుల సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలు చేపట్టిందని, సంక్రాంతికి మంజూరు చేసిన సీసీ రోడ్డులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Similar News

News January 21, 2025

ప్రజలు వాటిని నమ్మకండి: ప.గో కలెక్టర్

image

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే కలెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేస్తాం. వేరే వారి పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మి ప్రజలు మోసపోవద్దు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను గందరగోళం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్ హెచ్చరించారు.

News January 21, 2025

ఆ నిధులను సమాజ సేవకే వినియోగిస్తాం: ప.గో కలెక్టర్

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు ద్వారా సేకరించిన నిధులను సమాజ సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదుపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. రూ.లక్ష కంటే ఎక్కువగా సభ్యత్వ రుసుము సేకరించిన తణుకు తహశీల్దార్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ అభినందించారు.

News January 20, 2025

బిహార్‌కు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ RRR

image

ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ల విధులు గురించి తెలుసుకున్నారు.