News September 9, 2024

ఏలూరు జిల్లాలో రేపు కొన్ని స్కూళ్లకు సెలవు

image

ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా మంగళవారం కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలులో 1, పెదపాడులో 7, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండిలో 5 స్కూళ్లకు సెలవు ఉంటుందన్నారు. మిగతా పాఠశాలలు యధావిధిగా నడపవచ్చని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

Similar News

News January 7, 2026

ఏలూరు: నిర్లక్ష్యం ఖరీదు.. రూ.900 కోట్లు!

image

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్‌ నిర్మాణ సమయంలో 2019 నాటికి ఇరువైపులా ఖాళీలు వదిలేశారు. ఖాళీల గుండా 2020లో వచ్చిన వరదకి డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది. దీనిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఖజానాకు భారీగా చిల్లులు పెట్టింది. దెబ్బతిన్న వాల్‌ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు రూ.900 కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News January 7, 2026

ప.గో జిల్లా జేసీ హెచ్చరిక

image

యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవని జేసీ రాహుల్ హెచ్చరించారు. డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 83310 56742‌కు తెలియజేయాలన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రిటైల్ డీలర్లతో సమీక్షించారు.

News January 7, 2026

ప.గో జిల్లా జేసీ హెచ్చరిక

image

యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవని జేసీ రాహుల్ హెచ్చరించారు. డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 83310 56742‌కు తెలియజేయాలన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రిటైల్ డీలర్లతో సమీక్షించారు.