News March 16, 2025

ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తప్పదా?

image

నూజివీడులో 32 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో YCP 25 చోట్ల గెలవడంతో ఛైర్‌పర్సన్‌గా త్రివేణి దుర్గా ఎన్నికయ్యారు. ఇటీవల 10మంది కౌన్సిలర్లు TDPలోకి రావడంతో ఆ పార్టీ బలం 17కి చేరింది. దీంతో ప్రస్తుత ఛైర్‌పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి.. ఆ పదవిని తమ ఖాతాలో వేసుకోవడానికి TDP ప్రయత్నిస్తోంది. ఇది జరగాలంటే 22 మంది మద్దతు అవసరం కాగా.. మిగిలిన 5మంది కౌన్సిలర్ల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది.

Similar News

News December 4, 2025

భారత్‌ చేరుకున్న రష్యా డిఫెన్స్ మినిస్టర్.. కాసేపట్లో పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో భారత్‌కు రానున్న నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్‌తో కలిసి ఆయన భారత్-రష్యా 23వ సమ్మిట్‌లో పాల్గొంటారు. భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌తో ఆండ్రీ భేటీ అవుతారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. అటు పుతిన్ భారత్‌‌కు చేరుకున్నాక ప్రెసిడెంట్ ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

News December 4, 2025

బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పకడ్బందీగా నిర్వహించాలి: DM&H0

image

ఆస్పత్రులలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆదేశించారు. సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రులలో ఆమె తనిఖీలు నిర్వహించినారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. రోగులకు సక్రమంగా సేవలందించాలన్నారు.

News December 4, 2025

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

image

TG: పంచాయతీ ఎన్నికలకు SEC భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా పలు జిల్లాల్లో పోలీసు బలగాలు గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. షాద్‌నగర్ పరిధిలోని పలు పంచాయతీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.