News February 26, 2025

ఏలూరు జిల్లాలో సెలవులు

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఈనెల 27 గురువారం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఉపాధ్యాయులతో పాటు, డిప్యూటీ ఎంఈవోలు, ఎంఈఓలకు కూడా సెలవు వర్తింపజేయడం జరిగిందన్నారు.

Similar News

News February 24, 2026

ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>ఇందిరాగాంధీ<<>> నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD, M.Phil/NET/JRF, ఎంఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal.igntu.ac.in

News February 24, 2026

YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN

image

AP: వైసీపీ ప్రభుత్వంలో తిరుమలపైనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూమతంపై దాడులు చేశారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘2,032 దేవాలయాలపై దాడి చేశారు. 59 విగ్రహాలు చోరీ అయ్యాయి. ఎన్నో చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారు. అంతర్వేది రథం దగ్ధాన్ని తేనెటీగల దాడి అని చెప్పారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు’ అని వివరించారు. ఎవరైనా దేవాలయాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

News February 24, 2026

నిర్మల్: పది పరీక్షలకు 9,758 మంది విద్యార్థులు

image

పదవ తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి, ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి, 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9,758 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.