News February 15, 2025

ఏలూరు జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్ 

image

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

Similar News

News November 27, 2025

FLASH.. HNKలో సిగ్మా జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన

image

హనుమకొండలో ఆందోళన నెలకొంది. బట్టుపల్లి వద్ద ఉన్న సిగ్మా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం అయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి కనిపించకపోవడంతో విద్యార్థి తండ్రి కాలేజీ బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

News November 27, 2025

BREAKING: హైడ్రా‌పై హైకోర్టు ఆగ్రహం

image

సున్నంచెరువు కూల్చివేతల వ్యవహారంపై హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. FTL నిర్ధారణ లేకుండా హద్దులు నిర్ణయించడం, గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పట్టించుకోకపోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. సియేట్‌ మారుతీహిల్స్‌ కాలనీలో ఇకపై ఫెన్సింగ్, కూల్చివేత చర్యలకు దిగొద్దని హైకోర్టు హెచ్చరించింది.

News November 27, 2025

పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

image

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్‌ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.