News February 15, 2025

ఏలూరు జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్ 

image

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

Similar News

News November 22, 2025

ADB: కారు జోరు.. కాంగ్రెస్ ఇలా.. బీజేపీ డీలా..!

image

రాష్ట్రంలో అన్ని ప్రధాన ఎన్నికల్లో ఓటమి చూసిన కారు పార్టీ ADBలో ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. తరచూ వివిధ సమస్యలపై ఆందోళన నిర్వహిస్తూ ప్రజల్లో మద్దతు కూడగట్టుకుంటోంది. అభివృద్ధి తమ మంత్రమని కాంగ్రెస్ వివిధ పనులు చేస్తూ ముందుకు వెళ్తోంది. అధికార పార్టీ కార్యక్రమాలు అంతంతగానే ఉన్నాయి. ఇక బీజేపీ హిందుత్వపరంగా బలంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలు అంతగా కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

News November 22, 2025

ఇల్లంతకుంట: ‘అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర’

image

ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మహిళల ఆత్మ గౌరవానికి తోడ్పడుతుందని మానకొండూర్ MLA సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా మానకొండూర్ MLA కవ్వంపల్లి పాల్గొన్నారు. ఆయన వెంట ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.

News November 22, 2025

అయిజ: రైతులను ప్రోత్సహించేందుకే సంబరాలు

image

రైతులను వ్యవసాయపరంగా ప్రోత్సహించేందుకు రైతు సంబరాలు నిర్వహిస్తున్నట్లు అయిజ సింగల్ విండో మాజీ ఛైర్మన్ సంకాపూర్ రాముడు పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో వెలసిన వరాహ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆలయ ప్రాంగణంలో అంతర్రాష్ట్ర న్యూ కేటగిరి విభాగం బండలాగు పోటీలు ప్రారంభించారు. వ్యవసాయంలో ప్రధానమైన ఎడ్ల ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.