News April 9, 2025

ఏలూరు: జిల్లాలో 11న సీఎం పర్యటన ఇలా..

image

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో 11న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్‌లో ఉదయం 10. గంటలకు వడ్లమాను గ్రామం చేరుకుంటారు. అనంతరం బీసీ వర్గాల వారితో పని ప్రదేశంలో సమీక్షిస్తారు. 11.30 గంటలకు స్థానిక ప్రజా వేదిక వద్ద ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో ఆయన ముఖాముఖీ నిర్వహించనున్నారు. తిరిగి 2.30 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయవాడ బయలుదేరి వెళ్తారు.

Similar News

News November 4, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> కొండాపూర్‌లో దారుణ హత్య
> దేవరుప్పుల: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
> పాలకుర్తి: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
> జనగామలో నలుగురు దొంగల అరెస్ట్
> తుఫాన్ తో నష్టపోయిన పంటలను పరిశీలించిన కలెక్టర్
> బ్రిడ్జిలు నిర్మించాలని జనగామ కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన
> గూడ్స్ వెహికల్‌లో మనుషులను రవాణా చేయొద్దు: అధికారులు
> లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ

News November 4, 2025

బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం

image

బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం అయింది. జాతరకు వచ్చే భక్తుల రక్షణ కోసం 175 మంది పోలీసు సిబ్బంది, 25 మంది ఎస్సైలు, సీఐలు, ఇతర ఉన్నత అధికారులు డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 50 మంది కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణలో భాగస్వాములు అవుతారు. వ్యర్థాల నిర్వహణకు 6 ట్రాక్టర్లు, రోడ్లపై నీళ్లు చల్లడానికి 6 ట్యాంకర్లు పని చేయనున్నాయి.

News November 4, 2025

నేపాల్‌లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్‌పై సుప్రీంకోర్టు

image

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్‌లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.