News March 17, 2025
ఏలూరు జిల్లాలో 133 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణకు 133 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 25,179 మంది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారన్నారు. అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ పరీక్షల నిమిత్తం 62 మంది కస్టోడియన్లను, 1,120 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Similar News
News November 21, 2025
స్టేషన్ ఘనపూర్కు నూతన చర్మ వైద్య నిపుణురాలు

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ జువేనియా అఫ్రీన్ (డెర్మటాలోజిస్ట్) చర్మ వైద్య నిపుణులు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె రాకతో చర్మ వ్యాధులకు ఇకపై ఇక్కడే చికిత్స అందనుంది. గతంలో ఇక్కడ డెర్మటాలజిస్ట్గా పనిచేసిన డాక్టర్ వీరాంజనేయులు డీసీహెచ్ఎస్ పనిచేసి పదవీ విరమణ పొందారు. సుమారు గత 4 నెలలుగా చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
News November 21, 2025
భూపాలపల్లి: 22న సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం” నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నదలచిన వారు 040-23311338 నంబర్కు కాల్ చేయాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
News November 21, 2025
ఖమ్మం: ఇందిరమ్మ చీరల పంపిణీకి మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకుంటే రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.


