News March 17, 2025
ఏలూరు జిల్లాలో 133 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణకు 133 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 25,179 మంది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారన్నారు. అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ పరీక్షల నిమిత్తం 62 మంది కస్టోడియన్లను, 1,120 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Similar News
News November 27, 2025
దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలి?

దక్షిణామూర్తి చిత్రపటాన్నిగురువారం రోజున ఇంట్లో ప్రతిష్ఠిస్తే సకల శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ ప్రభావం అధికంగా ఉండే ఈరోజున జ్ఞాన స్వరూపుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విద్యాభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. ‘శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పండుగ రోజులలో విగ్రహ స్థాపన చేయవచ్చు. నిష్ణాతులైన పండితుల సలహా మేరకు ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరం’ అని చెబుతున్నారు.
News November 27, 2025
రుద్రవరంలో యాక్సిడెంట్.. 150 బస్తాల ధాన్యం నేలపాలు

రుద్రవరం మండల పరిధిలోని గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళుతున్న డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గుట్టకొండ ప్రాంతం నుంచి సుమారు 150 బస్తాలు వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్కు గాయాలయ్యాయి.
News November 27, 2025
గన్నవరం పోతే ఎలా..? భిన్నవాదనలు..!

కృష్ణా జిల్లాలోని గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్పై ఎమ్మెల్యేలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి గన్నవరం విడిపోతే జిల్లా ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇప్పటి వరకు ఈ ఎయిర్ పోర్ట్ జిల్లాకు పెద్ద ఆస్తిగా ఉంది. ఈ క్రమంలో గన్నవరంను చేజార్చుకోకూడదన్నది కొంతమంది ఎమ్మెల్యేల మనోగతంగా తెలుస్తోంది.


