News March 17, 2025

ఏలూరు జిల్లాలో 133 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణకు 133 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 25,179 మంది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారన్నారు. అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ పరీక్షల నిమిత్తం 62 మంది కస్టోడియన్లను, 1,120 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Similar News

News April 20, 2025

కాబోయే భర్తకు ఉండాల్సిన 18 లక్షణాలు.. యువతి పోస్ట్ వైరల్

image

తనకు కాబోయే భర్తకు 18 లక్షణాలు ఉండాలంటూ డేటింగ్ యాప్‌లో ఓ యువతి పోస్ట్ చేసింది. ‘నాపై డీప్ లవ్, రూ.2.5 కోట్ల జీతం, లగ్జరీ లైఫ్, ఉదార స్వభావం, తెలివైన, ధైర్యం, విలువలు, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, సామాజిక గౌరవం, ఫ్యామిలీ పర్సన్, నా లైఫ్‌స్టైల్‌కు సపోర్ట్, ట్రావెలింగ్, ప్రైవసీకి ప్రాధాన్యం, లైంగిక క్రమశిక్షణ, గర్భనిరోధక చర్యలు, ఈజీ లైఫ్ లీడ్ చేయించే వాడు’ తనకు భర్తగా కావాలని రాసుకొచ్చింది. మీ COMMENT?

News April 20, 2025

DSC: కర్నూలు జిల్లాలో పోస్టులు ఇలా..

image

కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను <<16155948>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 82
➤ హిందీ:114 ➤ ఇంగ్లీష్: 81
➤ గణితం: 90 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 74 ➤ సోషల్: 112
➤ పీఈటీ: 209 ➤ఎస్జీటీ: 1,817 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 4, ఫిజిక్స్ 4, జీవశాస్త్రం 4, సోషల్ 2, పీఈటీ 2, ఎస్జీటీ 10 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

News April 20, 2025

మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

image

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్‌ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్‌ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.

error: Content is protected !!