News October 30, 2024
ఏలూరు జిల్లాలో 16,38,436 మంది ఓటర్లు

ఏలూరు జిల్లాలో జనవరి, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ -2025 డ్రాఫ్ట్ పబ్లికేషన్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్ఎస్ఆర్ -2025లో భాగంగా 16,38,436 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,99,781, మహిళలు 8,38,531, థర్డ్ జెండర్ ఓటర్లు 124 మంది ఉన్నారన్నారు.
Similar News
News October 23, 2025
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో రానున్న 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి
గురువారం అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299219 ఏర్పాటు చేశామన్నారు.
News October 23, 2025
రేపు పాఠశాలలకు సెలవు: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్ నాగరాణి
గురువారం ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, చెరువుల దగ్గరగా ఉండకుండా అందరికీ సమాచారం అందించాలన్నారు. రియల్ టైమ్ సమాచారం వస్తుందని, దానిని ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
News October 23, 2025
PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.


