News March 27, 2025

ఏలూరు జిల్లాలో 4 వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం

image

ఏలూరు జిల్లాలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు స్థాపించడానికి 4 వేల ఎక‌రాల భూమిని సిద్ధం చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. వ్యవసాయ, పర్యాటక రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేయ‌డానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. జిల్లా జీడీపీని 15 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పామాయిల్, ఉద్యాన పంటలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

Similar News

News November 7, 2025

HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

image

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

News November 7, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

★బాలియాత్ర ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
★జలుమూరు: జాబ్ మేళాలో 203 మంది ఎంపిక
★కాశీబుగ్గలో NCC విద్యార్థుల ర్యాలీ
★నిరుపేదలను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
★పలాసలో కిడ్నాప్.. బాధితుడు ఏమన్నాడంటే ?
★ఎచ్చెర్ల: ఇష్టారీతిన మట్టి తరలింపు
★రణస్థలం: రహదారి లేక నరకం చూస్తున్నాం
★శ్రీకాకుళం: ప్రిన్సిపల్ వేధింపులతో చనిపోవాలనుకున్నా
★సోంపేట: అధ్వానంగా రోడ్లు..వాహనదారులకు తప్పని అవస్థలు

News November 7, 2025

KNR: విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ కమిటీల ఏర్పాటు

image

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని డివిజన్ల కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీ చైర్మన్‌గా తుల నాగరాజ్, కన్వీనర్‌గా వెలిశెట్టి రమేష్, గంగులోతు శివకృష్ణలను సభ్యులు ఎన్నుకున్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.