News March 8, 2025

ఏలూరు జిల్లాలో 8 నుంచి పి-4 సర్వే: కలెక్టర్

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 8 నుంచి పీ-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సర్వేను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. 

Similar News

News November 18, 2025

పత్తి రైతులను ఆదుకోవాలి: కేటీఆర్‌

image

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. భైంసా కాటన్ మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 8% తేమశాతం నిబంధనతో రైతులు నష్టపోతున్నారని, 20% తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న బోరాజ్‌ కదిలి రావాలని పిలుపునిచ్చారు.

News November 18, 2025

INDIA హసీనాను బంగ్లాకు అప్పగించకపోవచ్చు!

image

నిరసనల అణచివేతకు ఆదేశాలిచ్చి పలువురి మృతికి కారణమయ్యారనే ఆరోపణలతో దేశాన్ని వీడిన PM హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే. నేరారోపణలున్న ఆమెకు ఆశ్రయం తగదని ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం వెంటనే అప్పగించాలని ఆ దేశం ఇండియాను హెచ్చరించింది. అయితే అందుకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 8, 29 ప్రకారం రాజకీయ ప్రేరేపిత, న్యాయ విరుద్ధ అభ్యర్థనను తోసిపుచ్చే అధికారం ఇండియాకు ఉంది.

News November 18, 2025

కృష్ణా జిల్లాలో ఏడుగురు ఎస్ఐల బదిలీ

image

జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. VRలో ఉన్న కెవై దాస్‌ను చల్లపల్లి SIగా, నాగ శివనాధ్‌ను DCRB SIగా బదిలీ చేశారు. చల్లపల్లి SI PSV సుబ్రహ్మణ్యం ఇనగుదురు SI-1గా, కోడూరు SI శిరీషను కూచిపూడి SIగా, ఇనగుదురు SI-1 YVV సత్యనారాయణను DTC పెదవేగి ఏలూరు జిల్లాకు, గుడివాడ వన్ టౌన్ SI గౌతమ్ ను అవనిగడ్డ SI-2గా బదిలీ చేస్తూ SP విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.