News March 8, 2025

ఏలూరు జిల్లాలో 8 నుంచి పి-4 సర్వే: కలెక్టర్

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 8 నుంచి పీ-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సర్వేను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. 

Similar News

News March 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 24, 2025

అచ్యుతాపురం జంక్షన్లో రోడ్డు విస్తరణకు ముహూర్తం ఫిక్స్ 

image

ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. ఆదివారం జరిగిన అచ్యుతాపురం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులమైన మనమందరం ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈనెల 31న అచ్యుతాపురం జంక్షన్‌లో రహదారి విస్తరణకు రాష్ట్రమంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

News March 24, 2025

నిర్మల్ జిల్లాకు 1,27,748 జవాబు పత్రాలు : DEO

image

మూల్యాంకన విధులను పారదర్శకంగా నిర్వహించాలని డీఈవో రామారావు అన్నారు. నిర్మల్‌ జిల్లాకేంద్రంలో ఆదివారం సీసీఓలు, ఏసీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా‌కేంద్రంలోని సెయింట్‌ థామస్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన స్పాట్‌ వాల్యూవేషన్‌ క్యాంప్ ఉంటుందన్నారు. మూల్యాంకన విధులు పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. దాదాపు 1,27,748 జవాబు పత్రాలు జిల్లాకు చేరుతాయని తెలిపారు.

error: Content is protected !!