News April 5, 2024

ఏలూరు జిల్లాలో 90% పెన్షన్ల పంపిణీ: డీఆర్డీఏ పీడీ

image

ఏలూరు జిల్లాలో 2,70,804 లబ్ధిదారులు ఉండగా గురువారం రాత్రి 8 గంటల వరకు 2,43,795 మందికి సామాజిక పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు వెల్లడించారు. పెన్షన్ పంపిణీ నిమిత్తం జిల్లాకు రూ.80.92 కోట్లు విడుదలయ్యాయని అన్నారు. ఇంతవరకు రూ.73.89 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గురువారం వరకు 90 శాతం పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు.

Similar News

News January 26, 2025

భీమవరం: తుది జాబితా ఆమోదం: జేసీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని భూముల మార్కెట్ విలువ పెంపునకు సమర్పించిన ప్రతిపాదనల తుది జాబితాను ఆమోదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్‌లో జేసీ జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్స్ పరిధిలోని అధికారులతో సమావేశమై జిల్లాలోని భూముల విలువల పెంపుదలకు ప్రతిపాదనలను సమీక్షించి తుది ప్రతిపాదలను సమీక్షించి ఆమోదించారు.

News January 26, 2025

భీమవరం: గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసీ 

image

భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాట్లు చేయడం చేస్తున్నట్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

News January 26, 2025

కాళ్ళలో సీనియర్ ఓటర్లను సన్మానించిన తహశీల్దార్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం కాళ్ల హైస్కూల్లో నిర్వహించారు. తహశీల్దార్ జి. సుందర్ సింగ్ మాట్లాడుతూ ఓటరు నమోదు ఆవశ్యకతను, ఓటు హక్కు విలువలను వివరించారు.  సీనియర్ ఓటర్లైన వయోవృద్ధులను సత్కరించి, కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి కొత్త ఓటు గుర్తింపు కార్డును పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటు ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. వీఆర్వోలు శివనాగరాజు, రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.