News February 28, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ ఏలూరు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు✷జిల్లావ్యాప్తంగా ఘనంగా టైలర్ల దినోత్సవ వేడుకలు ✷ అన్ని పాఠశాలలు, కాలేజీల్లో సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు ✷ కూటమి ప్రభుత్వం బడ్జెట్ పట్ల కూటమి నాయకుల హర్షం ✷ఇది మోసపూరిత బడ్జెట్: సీపీఐ నేత రామకృష్ణ ✷ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం✷ పలు శివాలయాలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Similar News
News November 22, 2025
టాస్క్ఫోర్స్ అదనపు SPగా కులశేఖర్ బాధ్యతలు

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్(RSSTF)అదనపు SPగా జె.కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి ASPగా పనిచేసిన ఈయన్ను తాజాగా టాస్క్ఫోర్స్కు అటాచ్ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన టాస్క్ఫోర్స్ హెడ్, తిరుపతి SP సుబ్బారాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టాస్క్ ఫోర్స్ SP శ్రీనివాస్తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 22, 2025
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం

సింగరేణి సీఎండీ బలరామ్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి త్వరలో వాట్సాప్ నెంబరును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికి, ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎండీ వెల్లడించారు.
News November 22, 2025
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


