News February 28, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ఏలూరు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు✷జిల్లావ్యాప్తంగా ఘనంగా టైలర్ల దినోత్సవ వేడుకలు ✷ అన్ని పాఠశాలలు, కాలేజీల్లో సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు ✷ కూటమి ప్రభుత్వం బడ్జెట్ పట్ల కూటమి నాయకుల హర్షం ✷ఇది మోసపూరిత బడ్జెట్: సీపీఐ నేత రామకృష్ణ ✷ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం✷ పలు శివాలయాలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

Similar News

News March 1, 2025

బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 10,838 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నేపథ్యంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే 08643 220182 కంట్రోల్ రూము నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST

News March 1, 2025

మాచర్లలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి 

image

మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్ శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ప్రకాశ్ తన భార్య ప్రసన్నతో కలిసి హైదరాబాద్ నుంచి ఒప్పిచర్లకు కారులో వస్తున్నారు. కొత్తపల్లి జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రకాశ్ భార్య ప్రసన్న మృతి చెందింది. 

News March 1, 2025

బాబోయే.. మండుతున్న ఎండలు

image

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. పరిగి మండలంలో నిన్న 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడే ఇలా ఉంటే మనుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల నేపథ్యంలో భయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

error: Content is protected !!