News March 2, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ఎమ్మెల్సీ అభ్యర్థుల కౌంటింగ్కు సర్వం సిద్ధం * జిల్లాలో సోమవారం రక్తమోడిన రోడ్లు ✷ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ బిజీ బిజీ పర్యటనలు ✷ వందమంది ప్రొబెషనరీ ఎస్ఐలకు నియామక ఉత్తర్వులు✷ ఓట్ల లెక్కింపులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ * పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు
Similar News
News November 20, 2025
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ టర్మ్స్

బిహార్ రాజకీయ భీష్ముడిగా పేరొందిన నితీశ్ ఇవాళ 10వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన తొలిసారి 2000 సం.లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జన్శక్తి.. ఇలా ఎన్నో పార్టీలతో కలిసి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
*2000 మార్చి 3- 2000 మార్చి 7 *2005-2010
*2010-2014 *2015 FEB 22- 2015 NOV 19 *2015-2017 *2017-2020 *2020-2022 *2022-24 *2024-2025 NOV.
News November 20, 2025
నెలాఖరులోగా ఎయిర్పోర్టు భూసేకరణ పూర్తి!

మామునూర్ ఎయిర్పోర్టు భూసేకరణ కొలిక్కి వస్తోంది. భూసేకరణలో 330 మంది భూమిని కోల్పోగా, వారిలో 180మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.120 కోట్లు జమయ్యాయి. మరో 80 మందికి త్వరలోనే రూ.60 కోట్లు పడనున్నాయి. ఈ నెలాఖరు వరకు భూసేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. 220 ఎకరాలను సేకరించగా, వాటిలో 20ఎకరాల బాధితులు కోర్టును ఆశ్రయించారు. 330 మందికి మొత్తం రూ.295కోట్లను ప్రభుత్వం పరిహారం అందించనుంది.
News November 20, 2025
542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24లోపు అప్లై చేసుకుని దరఖాస్తును స్పీడ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bro.gov.in/


