News March 14, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷జనసేన జయకేతనం ఆవిర్భావ సభకు పిఠాపురం తరలి వెళ్లిన జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు, కార్యకర్తలు
✷హోలీ సందర్భంగా రంగులు చిమ్ముకొని ఎంజాయ్ చేసిన జిల్లా వాసులు
✷జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుబ్బల మంగమ్మ, రెడ్డి గణపవరం కనకదుర్గమ్మ అమ్మవార్ల జాతర కార్యక్రమాలు
✷మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు
✷స్మార్ట్ మీటర్లను బిగించవద్దు: సీపీఐ
Similar News
News November 22, 2025
అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కల ‘ధర’హాసం..!

అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కలు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతవారం కిలో రూ.250 ధర ఉండగా శనివారం 300కి చేరిందని స్థానికులు తెలిపారు. అతి చల్లని ప్రదేశాలు ఉన్న చింతపల్లి, పాడేరు, ముంచింగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో కొండలపై గిరిజనులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో పంటకు తీవ్రంగా నష్టం వచ్చిందని రైతులు అంటున్నారు. దిగుబడి లేక రేటు పెరిగిపోతుందన్నారు.
News November 22, 2025
గద్వాల్: సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం రోజున గ్రామాల వారీగా రిజర్వేషన్ల రోస్టర్ విడుదలకు రంగం సిద్ధమైంది. గద్వాల్ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News November 22, 2025
వనజీవి జీవితంపై సినిమా మొదలు!

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.


