News March 6, 2025

ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

image

దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంతత్రి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల బ్రిడ్జి వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరమన్నారు.

Similar News

News November 20, 2025

SAతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ ఎవరు?

image

SAతో ODI సిరీస్‌కు IND కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. గాయాల నుంచి కోలుకుంటున్న కెప్టెన్ గిల్, VC శ్రేయస్ ఈ సిరీస్‌లో ఆడడం కష్టమే. ఈ నేపథ్యంలో KL రాహుల్ లేదా అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. గతంలో KLకు ODIsలో కెప్టెన్సీ చేసిన అనుభవముంది. ఒకవేళ అక్షర్‌కు అవకాశమిస్తే మరో కొత్త కెప్టెన్ వచ్చినట్లవుతుంది. తొలి ODI ఈనెల 30న జరగనుంది.

News November 20, 2025

HYD: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని

image

ఈ కార్ రేసు అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఛార్జ్ షీట్ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, సీఎం అంటే గౌరవంలేకుండా పొగరుగా వ్యవహిరించడం ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు.

News November 20, 2025

VZM: ‘ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు’

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తవిటి నాయుడు అన్నారు. విజయనగరంలోని RIO కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 23 – మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు 66 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.