News November 12, 2024

ఏలూరు: జిల్లా జైల్‌ను పరిశీలించిన ఎస్పీ

image

ఏలూరు జిల్లా జైల్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. జైల్‌లో ముద్దాయిలకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడుతూ ఖైదులు సత్ప్రవర్తనతో మేలగాలని సూచించారు. జైలు నుంచి బయటకు వచ్చినవారి జీవనోపాధి కోసం పోలీసు వారు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాన్ని కల్పిస్తామని తెలిపారు.

Similar News

News February 10, 2026

ప.గో: ఫైళ్ల నిర్వహణ ఇక ఈ-ఆఫీస్‌ ద్వారానే

image

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఇకపై ప్రతి ఫైలు ఈ-ఆఫీస్‌ ద్వారానే పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు నిర్వహించిన గూగుల్ మీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఉద్యోగులందరూ ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

News February 10, 2026

ప.గో: ట్రంప్ టారిఫ్ తగ్గించినా.. ‘సిండికేట్’ వదలడం లేదు (2/3)

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇటీవల ట్రంప్ ఎగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో మేలు జరుగుతుందని రైతులు భావించారు. అయితే సిండికేట్ వ్యాపారుల వల్ల రైతులకు ఫలితం దక్కడం లేదు. మేతలు, విత్తనాల ధరలు పెంచి ట్రేడర్లు లాభాలను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, సిండికేట్ల దోపిడీ నుంచి విముక్తి కలిగించాలని రైతులు కోరుతున్నారు.

News February 10, 2026

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

image

జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా బాధితులకు విముక్తి కలిగించాలన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.