News March 29, 2025
ఏలూరు జిల్లా టాప్ న్యూస్

*ఏలూరులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్ వెట్రీ సెల్వి*నూజివీడులో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి పార్థసారథి.*కొయ్యలగూడెంలో ఇంటి ముందు మృతదేహంతో ధర్నా.*తానా సభలకి రావాలంటు మంత్రి కొలుసు పార్థసారథి ఆహ్వానం.*ఉగాది పురస్కారాలకు 11మంది పోలీస్ సిబ్బంది గుర్తింపు.*ఏలూరులో ఆటో డ్రైవర్ల ఆందోళన. *ఏలూరులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
Similar News
News April 22, 2025
ఆర్మూర్: చెరువులో మునిగి వ్యక్తి మృతి

చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 22, 2025
AP న్యూస్ రౌండప్

* అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారీకి ADCL నిర్ణయం
* వచ్చే నెల 6 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
* మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి
* ఈ నెల 28న గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు.. వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ
* బోరుగడ్డ అనిల్పై అనంతపురంలో కేసు.. ఈ నెల 30కి విచారణ వాయిదా
News April 22, 2025
కొత్తపేట: జగన్ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

ఇటీవల కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ జగన్ను సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం కోనసీమ జిల్లాలో వైసీపీని మరింతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగ్గిరెడ్డికి సూచించనట్లు నాయకులు వెల్లడించారు.