News March 7, 2025

ఏలూరు జిల్లా టుడే టాప్ న్యూస్

image

➤ చోదిమెళ్ల జాతీయ రహదారిపై ప్రమాదం.. నలుగురి మృతి
➤ జీలుగుమిల్లి మండలంలో తోట దగ్ధం.
➤ పవన్ పెను మార్పులు తెచ్చారు: రెడ్డి అప్పలనాయుడు
➤ గండిగూడెంలో ట్రాన్స్‌ఫార్మర్‌పైనే నవ వరుడి మృతి
➤ ఏలూరు జిల్లాలో తాగు, సాగునీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్
➤ కల్లుగీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ తీసిన కలెక్టర్
➤ చాట్రాయి: చేపల వేటకు వెళ్లి అన్నదమ్ముల మృతి

Similar News

News February 12, 2026

5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.

News February 12, 2026

అందుకే BRS అధికారం కోల్పోయింది: కవిత

image

TG: ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే BRS అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. ‘ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే KCR అధికారం కోల్పోయారు. రేవంత్‌ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరు’ అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు.

News February 12, 2026

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ సన్‌ప్రీత్ సింగ్‌

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జనగామ, స్టే.ఘ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.