News March 22, 2025
ఏలూరు జిల్లా దొంగలు విశాఖలో దొరికారు..!

కేబుల్ వైర్ల దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు. విశాఖ R&B ఆఫీసు సమీపంలోని ఏకలవ్య కాలనీకి చెందిన పిట్టోడు, ఏలూరుకు చెందిన శ్రీను గతంలో కేబుల్ వైర్ పనులు చేశారు. ఎంతో విలువైన ఆవైర్లను కొట్టేయడానికి ప్లాన్ వేశారు. BSNLల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోరనుకున్నారు. MVP డబుల్ రోడ్డులో రాత్రి వేళ గుంతలు తవ్వి టెలిఫోన్ వైర్లను దొంగలించారు. పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 14, 2025
ములుగు కలెక్టర్ను ఇంటర్వ్యూ చేసిన బాలలు

ములుగు కలెక్టర్ దివాకర్ను విద్యార్థులు ఇంగ్లిషులో ఇంటర్వ్యూ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లిష్ లెర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్తో ముఖాముఖి నిర్వహించారు. అలవాట్లు, అభిరుచులు, తదితర విషయాలను అడిగారు. జిల్లాలోని 72 ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ చదవడం, నేర్చుకోవడం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
News November 14, 2025
మంత్రి లోకేశ్తో ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలపై చర్చలు

CII సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరమ్ డైరెక్టర్ జోడి మెక్కే, విశాఖ జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు మంత్రి లోకేశ్ను కలిశారు. తీరప్రాంత, సముద్ర పరిశోధన, ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలు, స్థిరమైన పర్యాటకం,గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఏయూ భాగస్వామ్య బలోపేతంపై మాట్లాడారు. రాష్ట్రంలో ఉష్ణమండల నీటి పరిశోధన, ఆరోగ్యసంరక్షణ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు.
News November 14, 2025
వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.


