News March 30, 2025
ఏలూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాదిని జిల్లా ప్రజలు ఆనందంతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, వెల్లివిరియాలని కోరారు. రైతులకు పాడిపంటలు బాగుండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 10, 2026
నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.
News January 10, 2026
బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(1/2)

ఈ పద్ధతిలో చెరకు గడల నుంచి అర్ధ చంద్రాకారపు కన్నులను వేరు చేసి పెంచుతారు. చెరకు గడల్లో కుళ్లిన, వేర్లు వచ్చిన చెరకు కన్నులను విత్తన శుద్ధి చేసుకొని ట్రేలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడతారు. ప్లాస్టిక్ ట్రేలలో గుంతలను 1/3 వంతు వరకు కోకోవిట్తో నింపి కన్నులను పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.
News January 10, 2026
రైల్వే పిట్ లైన్ కోసం కృషి: ఎంపీ శబరి

నంద్యాలకు రైల్వే పిట్ లైన్ కోసం కృషి చేస్తున్నానని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. రైల్వే పిట్ లైన్ ఏర్పాటు వల్ల నంద్యాల వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రైల్వే పిట్ లైన్ అనేది నియమించబడిన ఒక ట్రాక్ అని, దీనివల్ల రైల్వే సిబ్బంది రైలు కింద సులభంగా పనిచేయడానికి వీలుంటుందని అన్నారు.


