News April 9, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న లోక్ అదాలత్ 

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల సముదాయాల్లో మే 10న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాదు కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంకు లావాదేవీలు కేసులు పరిష్కారించుకోవచ్చన్నారు. 

Similar News

News February 24, 2026

కూలెంట్ ఉన్నచోటే తేడా జరిగి ఉండొచ్చు: వీరపాండియన్

image

AP: పాలకల్తీ <<19216426>>ఘటనకు<<>> సంబంధించి రక్తనమూనాలు సేకరించడం సహా పలు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్ తెలిపారు. పాలరుచిలో తేడా వచ్చిందని.. బాధితులకు తొలుత వాంతులు అయ్యాయని వివరించారు. ఒకే ప్రాంతం నుంచి రావడంతో వైద్యులకు అనుమానం వచ్చిందన్నారు. కూలెంట్ వద్దే ఏదైనా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో మరో నెలపాటు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు.

News February 24, 2026

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

News February 24, 2026

NRPT: SSC, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం నారాయణపేట కలెక్టరెట్‌లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.