News February 12, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 638 సెల్ ఫోన్లు రికవరీ

image

ఏలూరు జిల్లాలో రూ.76 . 56 లక్షలు విలువ చేసే 638 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిశోర్ తెలిపారు. బుధవారం ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు ఫోన్లను అందచేశారు. సెల్ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. నేరానికి వినియోగించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News November 22, 2025

గద్వాల్: రోడ్డు ప్రమాదామా.. హత్యా..?

image

గద్వాల జిల్లా కేటీదొడ్డి(M) నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడు నిన్న <<18350776>>రోడ్డు ప్రమాదం<<>>లో మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరుపై భార్య, పిల్లలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని భార్య ఆరోపించారు. సీసీ కెమెరాలు పరిశీలించి, కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని ధరూర్ ఎస్ఐ తెలిపారు. అయితే బొలేరో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

News November 22, 2025

ములుగు: నేడు డీజీపీ ఎదుట లొంగిపోనున్న కీలక నేతలు

image

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన కొయ్యడ సాంబయ్య@ఆజాద్, డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాజీ నారాయణ, కంకణాల రాజిరెడ్డితో పాటు 20 మంది కేడర్ లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట వీరంతా లొంగిపోనున్నారు.

News November 22, 2025

సింగరేణి శుభవార్త.. 1,258 మంది ఉద్యోగులు పర్మినెంట్

image

సింగరేణి సంస్థలో పని చేస్తున్న 1,258 మంది తాత్కాలిక ఉద్యోగులను ఇకనుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లో వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.