News February 12, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 638 సెల్ ఫోన్లు రికవరీ

image

ఏలూరు జిల్లాలో రూ.76 . 56 లక్షలు విలువ చేసే 638 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిశోర్ తెలిపారు. బుధవారం ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు ఫోన్లను అందచేశారు. సెల్ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. నేరానికి వినియోగించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News October 15, 2025

డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యం: నారాయణపేట ఎస్పీ

image

జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తామని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కమ్యూనల్ గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, గ్రామాలు, పట్టణాల్లో పెట్రోలింగ్ పెంచుతామన్నారు. సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు.

News October 15, 2025

IPS పూరన్ సూసైడ్: ట్విస్టులెన్నో.. (1/2)

image

TGకి చెందిన హరియాణా IPS అధికారి <<18001541>>పూరన్<<>> సూసైడ్ వెనుక ఎన్నో ట్విస్టులు. IT కథనం ప్రకారం.. రోహతక్ IGగా ఉన్న పూరన్‌ను PTCకి బదిలీ చేశారు. దీంతో సెలవు పెట్టి PSO సుశీల్‌తో కలిసి చండీగఢ్‌కు బయలుదేరారు. మధ్యలో ASI సందీప్ టీమ్ ఆ కారును ఆపి సుశీల్‌ను అదుపులోకి తీసుకుంది. ‘తర్వాత నీ వంతే’ అని పూరన్‌ను బెదిరించారు. ఆయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ కోసం సుశీల్‌పై ఒత్తిడి చేసి వారం తర్వాత ACB కేసుపెట్టింది.

News October 15, 2025

IPS పూరన్ కుమార్ సూసైడ్ కేసులో ట్విస్టులెన్నో.. (2/2)

image

వీటిపై పూరన్ DGP, SPకి కాల్ చేసినా స్పందన లేదు. తర్వాత ఆయన సూసైడ్ చేసుకోగా భార్య కేసు పెట్టారు. మృతికి కులవివక్ష కారణమన్న విమర్శలు రేగడంతో DGP, SPని మార్చారు. ఈక్రమంలో పూరన్ అవినీతిపరుడని వీడియో తీసి ASI సందీప్ మరణించడం కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్ ఇందర్జిత్‌‌తో పూరన్‌కు ఆర్థిక ఒప్పందాలున్నట్లు అతడు ఆరోపించాడు. కులవివక్ష అంశంగా ఉన్న కేసు ఇప్పుడు అవినీతి, పోలీసులు-నేరగాళ్ల బంధం దిశగా మళ్లింది.