News December 13, 2024

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 96 అర్జీల పరిష్కారం: జేసీ

image

ఏలూరు జిల్లాలో గత రెండు రోజుల్లో నిర్వహించిన 64 గ్రామ రెవిన్యూ సదస్సుల్లో 854 అర్జీలు రాగా వాటిలో అక్కడికక్కడే 96 అర్జీలు పరిష్కరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన సదస్సులకు 487 అర్జీలు రాగా 71అర్జీలు పరిష్కరించామన్నారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 16, 2025

యలమంచిలి: ‘పారిశ్రామిక వేత్తలు వస్తుంటే జగన్ ఓర్వలేక పోతున్నారు’

image

రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తల, పరిశ్రమలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలో రూ. 55 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులకు ప్రజల వద్దకు వచ్చి మాట్లాడే హక్కు లేదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

News November 15, 2025

ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14,17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు.

News November 15, 2025

గుంటూరులో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

image

మహిళల బ్యాగుల్లో నుంచి బంగారం నగలు దొంగలిస్తున్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెం యాగరపల్లికి చెందిన ఆరుగురు దొంగల ముఠాను గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందడంతో శుక్రవారం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.22లక్షల విలువైన 75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు.