News March 5, 2025

ఏలూరు: జీవీ సుందర్‌కు 16,183 ఎక్కువ ఓట్లు

image

ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. వీరి తర్వాత మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. రాజశేఖర్‌కు 1,24,702 ఓట్లు రాగా, వీరరాఘవులకు 47,241, జీవి సుందర్‌కు 16,183 ఓట్లు వచ్చాయి. 

Similar News

News December 2, 2025

కర్నూలు రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలివే.!

image

కర్నూలు హైవే-44 సంతోశ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం <<18451272>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ మృతి చెందినవారి వివరాలను పోలీసులు తెలిపారు. మృతులు గూడూరుకి చెందిన మాలకమతల చంద్రమోహన్(32), మాల సుమన్(30)గా పోలీసులు గుర్తించారు. కాగా గాయపడిన మాల నవీన్ (33)ది ఎమ్మిగనూరు. అయితే వీరు కూలీ పనులతో జీవనం సాగించేవారని కుటుంబసభ్యులు తెలిపారు.

News December 2, 2025

జన్మభూమి ట్రైన్ నెంబర్ మార్పును నిలిపివేసిన అధికారులు

image

విశాఖపట్నం-లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ట్రైన్ నెంబర్‌ను 12805/12806 నుంచి 18501/18502కి 2026 ఫిబ్రవరి 15 నుంచి మారబోతుందని రైల్వే అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మార్పుని నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తాజాగా మరో ప్రకటనలో తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు.

News December 2, 2025

క్రమబద్దీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

పట్టణ ప్రాంతాలలో అనధికార లే అవుట్లు, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో ఆయన మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. అనధికార ఆక్రమణలను లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. ఈ లోపు అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించుకోవాలన్నారు.