News March 30, 2025
ఏలూరు: జైల్లో మహిళా ఖైదీ సూసైడ్

ఏలూరులో జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న శాంతికుమారిని అనే మహిళా ఖైదీ బ్యారక్లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
నంద్యాల: పీజీఆర్ఎస్కు 81 ఫిర్యాదులు

నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
నంద్యాల: పీజీఆర్ఎస్కు 81 ఫిర్యాదులు

నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
బోసిపోయిన భూపాలపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం

ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా రిజస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయల్లో జరిగిన ఏసీబీ దాడుల తర్వాత భూపాలపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం బోసిపోయింది. భూపాలపల్లిలో రెండు రోజులుగా డాక్యుమెంట్, రైటర్ షాపులు తెరుచుకోక పోవడంతో భూమి క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మ్యారేజీ రిజిస్ట్రేషన్లు మాత్రమే కొనసాగుతున్నాయి.


