News March 30, 2025

ఏలూరు: జైల్లో మహిళా ఖైదీ సూసైడ్

image

ఏలూరులో జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న శాంతికుమారిని అనే మహిళా ఖైదీ బ్యారక్‌లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 4, 2025

పెద్దపల్లి: ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతి

image

PDPL(D) ధర్మారం మండలం నాయికంపల్లి తండాకు చెందిన నవనందుల రాజేశ్(36) గోదావరి స్నానం చేసి బైక్‌పై ఇంటికి వస్తుండగా పత్తిపాక డాంబర్ ప్లాంట్ వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనతో పాటు ఉన్న అరవెండి కిష్టయ్య(45), మంగారపు సాయికుమార్‌(30)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. CI ప్రవీణ్‌ కుమార్, SI ప్రవీణ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News December 4, 2025

VJA: భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు నజరానా

image

భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రోత్సాహకంగా భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జట్టుకు రూ.10 లక్షల చెక్కును కెప్టెన్ దీపికకు అందజేశారు. ఫైనల్‌లో కీలక పాత్ర పోషించిన పొంగి కరుణా కుమారికి రూ. 5 లక్షలు, జట్టు కోచ్ అజేయ్ కుమార్ రెడ్డికి రూ.1 లక్షను ఏసీఏ ప్రదానం చేసింది.

News December 4, 2025

ఖమ్మం నేతల ప్రస్థానం.. సర్పంచ్‌ నుంచే రాష్ట్ర రాజకీయాలకు!

image

నేటి రాజకీయాల్లో సర్పంచ్‌ పదవి అత్యంత కీలకమనడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రే దీనికి నిదర్శనం. రాంరెడ్డి వెంకటరెడ్డి, వనమా వెంకటేశ్వరరావు వంటి సీనియర్‌ నేతలు మొదట సర్పంచ్‌లుగా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, సున్నం రాజయ్య సైతం సర్పంచ్‌ నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఈ పదవి ప్రాధాన్యతను తెలియజేస్తోంది.