News February 13, 2026

ఏలూరు: డబ్బులు అడిగితే ఫోన్ చేయండి!

image

ఏలూరు జిల్లాలో పీఎం ఆవాస్‌ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 54,234 మంది, పట్టణాల్లో 2,750 మంది దరఖాస్తు చేసుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే నగర పరిధిలో 1,191 ఇళ్లు మంజూరయ్యాయని, మిగిలిన అర్హులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే 7093930105 నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇళ్ల మంజూరులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Similar News

News March 13, 2026

ఇంటర్ స్టూడెంట్ దారుణం.. ముగ్గురు బాలికలపై అత్యాచారం

image

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి కామాంధుడిగా మారిన ఘటన నాగర్‌కర్నూల్(D) కొల్లాపూర్(M)లో జరిగింది. ప్రేమ పేరుతో ముగ్గురు తోటి విద్యార్థినులపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. డబ్బు ఇవ్వకపోతే వాటిని పేరెంట్స్‌కు పంపుతానని, SMలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఓ బాలిక గర్భం దాల్చగా ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. ఓ విద్యార్థిని ఫిర్యాదుతో బాలుడితోపాటు ఇద్దరు వైద్యులు, నర్సును పోలీసులు అరెస్టు చేశారు.

News March 13, 2026

NLG: 62 పోస్టులు.. 16న ఇంటర్వ్యూలు

image

ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కోసం ఈనెల 16న ప్రిన్సిపల్ ఛాంబర్‌లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్స్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 14 మంది ట్యూటర్స్‌ను తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకోనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.