News March 20, 2025
ఏలూరు: తాగునీటి సమస్య తలెత్తితే చర్యలు

ఈ వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారం రోజులలో కార్యచరణ తీసుకోవాలన్నారు.
Similar News
News November 20, 2025
YVUలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU P.G. కళాశాల ఫైన్ ఆర్ట్స్ శాఖలో కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలు నియామకం కోసం ఈ నెల 25వ తేదీన 2 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సంప్రదించాలన్నారు.
News November 20, 2025
మార్పుల ద్వారా సాగును లాభసాటి చేయాలి: చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం జరగనుంది. వ్యవసాయంలో పంచ సూత్రాలపై ఏడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అగ్రిటెక్పై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో కార్యక్రమం సాగుతుంది. ఈ మేరకు గురువారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు.
News November 20, 2025
మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.


