News March 11, 2025
ఏలూరు: దళారుల ప్రమేయం లేకుండా సర్వే నిర్వహించాలి

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో లబ్ధిదారులు గుర్తింపు, పరిహారం లెక్కింపునకు నిర్వహించే గ్రామ సభలలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అర్హులైన లబ్దిదారుల నుంచే వివరాలు సేకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామసభలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను అదేశించారు.
Similar News
News December 4, 2025
ADB: ‘సైనికుల సహాయార్థం విరాళాలు అందించాలి’

దేశ రక్షణకు సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సైనిక పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఎన్సీసీ క్యాడెట్లు జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తారన్నారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణకు శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.
News December 4, 2025
‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
News December 4, 2025
పుతిన్ ఇష్టపడే ఆహారం ఇదే!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ భారత్కు రానున్నారు. ఆయన PM మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేస్తారని సమాచారం. పుతిన్ సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. బ్రేక్ఫాస్ట్లో చీజ్, తేనె కలిపి చేసే ట్వోరోగ్ తింటారు. గుడ్లు, పండ్ల జ్యూస్ తీసుకుంటారు. చేపలు, గొర్రె మాంసం ఇష్టంగా తింటారు. షుగర్ ఫుడ్స్కు దూరంగా ఉంటారు. అరుదుగా ఐస్క్రీమ్ తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో చేపల సూప్, నాన్ వెజ్కు ప్రాధాన్యమిస్తారు.


