News March 11, 2025

ఏలూరు: దివ్యాంగురాలు గీసిన చిత్రం ఆకట్టుకుంది!

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అంధ దివ్యాంగురాలైన బత్తుల అంజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజు కలెక్టర్ చిత్రపటాన్ని ఎంతో అందంగా గీసి ఆమెకు అందజేశారు. ఈ క్రమంలో ఆమె కృషికి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రశంసించారు.

Similar News

News October 14, 2025

సంగారెడ్డి: ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం: మంత్రి

image

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో విద్యా అవకాశాల్లో సామాజిక న్యాయం సాధ్యపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఇంతకాలం ప్రొఫెషనల్ కోర్సుల్లో నామమాత్రంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్ల వర్గీకరణతో ఈ ఏడాది సముచిత ప్రాధాన్యం లభించిందన్నారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలకు కూడా ఈ ఏడాది మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు రావడం సంతోషమన్నారు.

News October 14, 2025

భద్రాద్రి: నేతాజీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేతాజీ రామవరం క్యాంపస్‌లోని 100 మంది విద్యార్థుల హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం సందర్శించారు. హాస్టల్‌ వినియోగానికి అవకాశాలు పరిశీలించి, ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.

News October 14, 2025

NRPT: విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: ఉప ముఖ్యమంత్రి

image

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. పాఠశాలల్లో అందిస్తున్న భోజనం, సౌకర్యాలను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.