News March 11, 2025

ఏలూరు: దివ్యాంగురాలు గీసిన చిత్రం ఆకట్టుకుంది!

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అంధ దివ్యాంగురాలైన బత్తుల అంజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజు కలెక్టర్ చిత్రపటాన్ని ఎంతో అందంగా గీసి ఆమెకు అందజేశారు. ఈ క్రమంలో ఆమె కృషికి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రశంసించారు.

Similar News

News March 12, 2025

PhonePe చూసి మీరూ షాక్ అయ్యారా?

image

దేశంలోనే అత్యధిక యూజర్లు కలిగిన యూపీఐ యాప్ ‘ఫోన్‌పే’ అప్డేట్ అయింది. ఇప్పటి వరకూ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్‌లో జరిగిన మార్పులు చూసి కస్టమర్లు షాక్ అవుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ స్కాన్ చేయడం మినహా అందులో ఏ ఆప్షన్ అర్థం కావట్లేదని, ఇలా ఎందుకు అప్డేట్ చేశారని మండిపడుతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు ఇది ‘ఫోన్ పే’ యాప్ కాదంటూ ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. మీ కామెంట్?

News March 12, 2025

2027 WC వరకూ రోహిత్ ఆడాలి: పాంటింగ్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2027 ODI WC వరకూ ఆడాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆకాంక్షించారు. హిట్ మ్యాన్ భారత్‌కు మరో WC అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తాను ఇప్పుడే వన్డేలకు రిటైర్ కానని, భారత్‌కు నాయకత్వం వహించడం ఇష్టమని స్పష్టం చేశారు. ఆయన మాటలు చూస్తోంటే వచ్చే ODI WC అందించాలనే కసి కనిపిస్తోంది. ఆయన మనసులో అదే ఉందని భావిస్తున్నా’ అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చారు.

News March 12, 2025

సంగారెడ్డి: ‘పరీక్షకు 352 మంది విద్యార్థులు గైర్హాజరు’

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,727 మంది విద్యార్థులకు గాను 16,375 మంది విద్యార్థులు హాజరయ్యారని, 352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!