News November 9, 2024

ఏలూరు: దీపం-2 పథకంపై అధికారులతో జేసీ సమీక్ష

image

ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లు, ఆయిల్ కంపెనీ యాజమాన్యాలు, పౌర సరఫరా అధికారులతో శుక్రవారం స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 6,31,044 మంది బియ్యం కార్డుదారులలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుటకు అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈకెవైసి పూర్తైన తరువాత మాత్రమే అర్హులన్నారు.

Similar News

News November 26, 2025

ప.గో జిల్లా.. భారీ వర్షాలు.. హెచ్చరిక

image

ప.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News November 26, 2025

పెనుగొండ ఇక ‘వాసవీ పెనుగొండ’

image

పెనుగొండ ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే.

News November 26, 2025

పెనుగొండ ఇక ‘వాసవీ పెనుగొండ’

image

పెనుగొండ ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే.