News April 4, 2025
ఏలూరు: నకిలీ పోలీసులు అరెస్టు

సినీ ఫక్కీలో పోలీసులమని చెప్పుకుంటూ భీమడోలు పరిసర ప్రాంతాలలో దుకాణదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు మీడియాకు వివరాలు తెలిపారు. వీరంతా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామన్నారు. కేసుని ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్లను అభినందించారు.
Similar News
News September 16, 2025
పాలకొల్లు: స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

పాలకొల్లులో సోమవారం బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన ఏలూరి శ్రీను మృతి చెందాడు. శ్రీను తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొబ్బరి వలుపు పని నిమిత్తం శ్రీను పాలకొల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో 1063 మందికి టీచర్ ఉద్యోగాలు

ఉమ్మడి ప.గో జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1063 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1074 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1063 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 11 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఎంపికైన వారిలో 534 మంది పురుషులు, 529 మంది మహిళలున్నారు.
News September 16, 2025
219 అర్జీలు సత్వరమే పరిష్కరించండి: జేసీ

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 219 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.