News January 31, 2025
ఏలూరు నుంచి కుంభమేళాకు బస్సు

ఏలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి మహా కుంభమేళాకు బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలిపారు. ఏలూరులో ఆయన గురువారం రాత్రి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4న బస్సు బయలుదేరి 8 రోజుల పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్, వారణాసి, అయోధ్య, గయా, బుద్ధగయ, అరసవల్లి, శ్రీకూర్మం యాత్ర కొనసాగుతుందన్నారు. ఒక్కొక్కరికి రూ.12,500లు ఛార్జ్ చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 9, 2025
NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్నాథ్ సింగ్

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.
News November 9, 2025
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరు పెట్టి వచ్చే యాడ్స్, వాట్సాప్/ ఇన్స్టాగ్రామ్/ టెలిగ్రామ్ లింక్స్ను నమ్మవద్దు అన్నారు. తక్కువలో ఎక్కువ లాభాలు వచ్చే వాగ్దానాలు కచ్చితంగా మోసం చేసేందుకే అన్నారు. లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత APK/ఫైళ్ళు ఇన్స్టాల్ చేయవద్దని, OTP, UPI PIN వంటివి చెప్పొద్దన్నారు.
News November 9, 2025
KNR: ట్రాఫిక్ చలాన్ పేరుతో సైబర్ మోసం

KNR జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపి, APK యాప్ డౌన్లోడ్ చేయించడంతో చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ ఖాతా నుంచి రూ.70,000లు, ఇతర బాధితుల నుంచి మరో రూ.1.20 లక్షల వరకు సొమ్ము మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద లింకులు, యాప్లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు.


