News February 17, 2025
ఏలూరు: పీసీఆర్ఏస్ రద్దు.. కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లాలోని అన్ని డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో పిజిఆర్ఏస్ రద్దు చేసున్నట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News November 17, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం.. నేడు ఏం జరగనుంది?

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. స్పీకర్పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్తో పాటు 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను ధర్మాసనం నేడు విచారించనుంది. MLAలను విచారించేందుకు స్పీకర్కు మరింత సమయం ఇస్తారా? లేదా తుది నిర్ణయం తీసుకుంటారా? ఈ నెల 23న సీజేఐ గవాయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో విచారణను మరో బెంచ్కు పంపిస్తారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
News November 17, 2025
NLG: సన్నాల సాగుకే సై! కారణమదే…

జిల్లాలో రైతులు సన్నాల సాగుపై దృష్టి సారిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా సన్నాలైన చిట్టిపొట్టి, బీపీటీ, చింట్లు తదితర సన్నరకాలను సాగు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. సన్నాలను తేమ శాతం ఎక్కువ ఉన్నా మిల్లర్లే మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో.. రైతులు సాగు చేస్తున్న వరిలో 60 శాతం వరకు సన్నాలే ఉండడం గమనార్హం. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది.
News November 17, 2025
నల్గొండ: డీసీసీలపై మళ్లీ కసరత్తు..!

అర్ధంతరంగా ఆగిపోయిన DCC అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై TPCC మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే DCC రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్లో NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లో కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే.


