News March 7, 2025
ఏలూరు: పోలీసు సిబ్బంది వినతులను స్వీకరించిన ఎస్పీ

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు సిబ్బంది శాఖపరమైన సమస్యలపై సంక్షేమ దివస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం నిర్వహించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ వారి సమస్యల గురించి ఎస్పీకి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ స్వయంగా వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 21, 2025
విశాఖ మేయర్ పీఠం కదలనుందా?

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.
News March 21, 2025
నారాయణపేట: భార్యను చంపిన భర్త ARREST

నారాయణపేట మండలం రెడ్యానాయక్ తండాలో <<15830699>>భార్యను హత్య<<>> చేసిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డీఎస్పీ లింగయ్య శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భార్య శారు రాథోడ్(20) అంటే ఇష్టం లేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో భర్త వినోద్ నాయక్ ఈనెల 19న రాత్రి ముందస్తు పథకం మేరకు గొంతు నులిమి ఆమెను హత్య చేశాడని తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు.
News March 21, 2025
రెండేళ్ల తర్వాత రూపాయికి బెస్ట్ వీక్ ఇదే

భారత రూపాయి అదరగొట్టింది. డాలర్తో పోలిస్తే ఈ రెండేళ్లలో ఈ వారమే అత్యధికంగా ఎగిసింది. 1.2 శాతానికి పైగా బలపడింది. నేడు ఏకంగా 39 పైసలు బలపడి 85.97 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ పతనమవ్వడం, ఫారెక్స్ మార్కెట్లో జోక్యంతో పాటు లిక్విడిటీకి RBI మద్దతివ్వడం, ఫారిన్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెడుతుండటం, ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం, మొత్తం సర్ప్లస్ $4.5 బిలియన్లకు చేరడమే ఇందుకు కారణాలు.