News March 3, 2025
ఏలూరు : పోస్టల్ బ్యాలెట్లో 42 చెల్లని ఓట్లు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.
Similar News
News March 19, 2025
ఫొటో సెషన్నే నా జీవితంలో మైలురాయి: MLA సింధూర

శాసనసభలో ఫొటో సెషన్ నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర పేర్కొన్నారు. నియోజవర్గంలోని ప్రజల సమస్యలను సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా శాసన సభ్యులతో కలిసి దిగిన ఫొటో తన జీవితంలో మొదటి జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
News March 19, 2025
పుంగనూరు: 450 ఏళ్ల చరిత్ర కలిగిన సుగుటూరు గంగమ్మ జాతర

పుంగనూరు నగరి వీధిలో వెలసి ఉన్న సగుటూరు గంగమ్మ జాతరకు జమీందారు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతర ఈనెల 25,26వ తేదీల్లో జరగనుంది. సగుటూరు గంగమ్మ జాతరకు సుమారు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కొలువై ఉండటంతో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
News March 19, 2025
వాలీబాల్లో మంత్రి సవిత టీమ్ విజయం

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పోర్ట్స్ మీట్ -2025 మంగళవారం సందడిగా ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత నేతృత్వంలోని వాలీబాల్ టీమ్ మంత్రి అనిత టీమ్పై విజయం సాధించింది. పురుష ఎమ్మెల్యేలతో జరిగిన టగ్ ఆఫ్ వార్లో మంత్రి సవిత ప్రాతినిధ్యం వహించిన మహిళల జట్టు విజయం సాధించింది. మహిళల టగ్ ఆఫ్ వార్లో మంత్రి సవిత టీమ్పై మంత్రి అనిత టీమ్ విజయం సాధించింది.