News September 16, 2024

ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ రద్దు

image

ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్, డివిజనల్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కావున ప్రజల ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News October 15, 2024

ప.గో: మామిడి చెట్టు పడి మహిళ మృతి

image

దేవరపల్లి మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో మంగళవారం విషాద ఘటన నెలకొంది. గ్రామానికి చెందిన సుబ్బయ్యమ్మ పై ప్రమాదవశాత్తు మామిడి చెట్టు మీద పడడంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 15, 2024

ఏలూరు జిల్లాలో టెట్ పరీక్షలకు 48 మంది గైర్హాజర్

image

ఏలూరు జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 186 మంది విద్యార్థులకు 158 మంది, మధ్యాహ్నం 186 మందికి 166 మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 28 మంది, మధ్యాహ్నం 20 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.

News October 15, 2024

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో ఉండి ఎమ్మెల్యే

image

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి-2898AD చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అశ్వథ్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.