News February 3, 2025
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..ఎస్పీ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు ఇవ్వడానికి ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News September 13, 2025
GWL: విద్యార్థి దశలోనే మావోయిస్టు సిద్ధాంతాల వైపు

హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగి పోయిన మావోయిస్టు మహిళ నేత కల్పన @ సుజాత విద్యార్థి దశ నుంచే మావోయిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 10వ తరగతి వరకు అయిజలో చదివారు. ఇంటర్, డిగ్రీ గద్వాల MALD కాలేజీ పూర్తి చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా రాడికల్స్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులై చివరకు అడవి బాట పట్టారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలుగా కొనసాగుతూ జనజీవన స్రవంతిలో కలిశారు.
News September 13, 2025
IBలో 394 జాబ్స్.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. SC, STలకు ఎగ్జామ్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీలు రూ.500 చెల్లించాలి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.<
News September 13, 2025
నిజాంసాగర్: 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కులు విడుదల

ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రం 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 11,887 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.383 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. కాగా ప్రాజెక్టు ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.