News February 3, 2025
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..ఎస్పీ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు ఇవ్వడానికి ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News December 4, 2025
VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

విజయనగరం కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.
News December 4, 2025
సిద్దిపేట: 17 సర్పంచ్లు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలో తొలి విడత జీపీ ఎన్నికల్లో 17 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. గజ్వేల్ మండలంలోని రంగంపేట, ములుగు మండలంలోని జప్తిసింగాయపల్లి, వర్గల్(M) చాంద్ఖాన్ మక్త, తుంకిమక్తా, గుంటిపల్లి, జగదేవపూర్(M) పలుగుగడ్డ, నిర్మల్ నగర్, అనంతసాగర్, మాందాపూర్, BG వెంకటాపుర్, కొండాపూర్, దౌల్తాబాద్(M) లింగాయపల్లి, నర్సంపల్లి, రాయపోల్లోని ఆరెపల్లి, కొత్తపల్లి, మర్కుక్(M) ఎర్రవల్లి, నర్సన్నపేట జీపీలు ఏకగ్రీవమయ్యాయి.
News December 4, 2025
గద్వాల్: ఓ యువత ఏటువైపు మీ ఓటు..!

జోగులాంబ గద్వాల జిల్లాలో 11,600 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ సారి జరిగే సర్పంచ్ ఎలక్షన్లలో మొదటి ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్నారు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారా లేక మాటలు చెప్పి మబ్బి పెట్టే వారికి ఓటు వేస్తారా అనే సందేహం ఉంది. యువత మాత్రం అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువత తలచుకుంటే ఏదైనా చేస్తారని పలువురు ప్రజలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?


