News February 3, 2025
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..ఎస్పీ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు ఇవ్వడానికి ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News October 13, 2025
వనపర్తి: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయండి

వనపర్తి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గన్నీ బ్యాగులు, ధాన్యం క్లీన్ చేసే యంత్రాలు, బరువు కొలిచే యంత్రాలు, తేమ కొలిచే డిజిటల్ కాలిపర్స్, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
News October 13, 2025
NZB: మగాళ్లను మోసగించిన మహిళలకు జైలు శిక్ష

నిజామాబాద్లో పురుషులను మోసం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఆరుగురు మహిళలకు మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రాత్రి వేళలో చామంతి, లతా, లక్ష్మి, ఓడ్డే లక్ష్మి, ఎల్లమ్మ, డొక్కా చంద్రకళ మగవారి పట్ల న్యూసెన్స్ చేయగా సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు SHO పేర్కొన్నారు.
News October 13, 2025
‘కేంద్రీయ విద్యాలయానికి తరగతి గదులు కేటాయించాలి’

భద్రాద్రి జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి తాత్కాలిక తరగతి గదులకై కేటాయించబడిన భవనానికి మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. పాత కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనంద ఖనిలో గల భవన సముదాయాన్ని పరిశీలించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సూచనలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలన్నారు.