News March 12, 2025

ఏలూరు: ప్రేమించి నమ్మించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

ఆన్‌లైన్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి  ఏలూరు రూరల్ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే తక్కువ కులానికి చెందిన దానివని అవమానంగా దూషించడాని పోలీసులకు తెలిపింది. యువతి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. రాజమండ్రికి చెందిన శివగిరి సందీప్‌ ఆన్‌లైన్‌లో పరిచయమై ఆమెను మోసం చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 22, 2026

DGEMEలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DGEME) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in/

News January 22, 2026

ట్రంప్ విమర్శలపై మోదీ మౌనం వెనక మతలబిదీ..!

image

ప్రపంచ నేతలను ట్రంప్ ఎడాపెడా వాయించేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా PM కార్నీ, UK PM స్టార్మర్.. ఇలా స్థాయి, హోదా చూడకుండా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితిని ఊహించే మన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ చేసిన ఏ విమర్శలకూ స్పందించలేదు. మౌనం పాటిస్తూ ఆయన వలలో పడకుండా చూసుకున్నారు. మోదీ ఈ హుందాతనం వల్లే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే సాహసం ట్రంప్ చేయలేదు.

News January 22, 2026

KMR: జనసేన పార్టీలో చేరికలు

image

కామారెడ్డి 8వ వార్డుకు చెందిన వివిధ పార్టీల యువకులు జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ సమక్షంలో, సీనియర్ నాయకుడు లక్ష్మీ నర్సాగౌడ్ ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సైనికులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.