News March 12, 2025
ఏలూరు: ప్రేమించి నమ్మించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఆన్లైన్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఏలూరు రూరల్ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే తక్కువ కులానికి చెందిన దానివని అవమానంగా దూషించడాని పోలీసులకు తెలిపింది. యువతి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. రాజమండ్రికి చెందిన శివగిరి సందీప్ ఆన్లైన్లో పరిచయమై ఆమెను మోసం చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 28, 2025
NZB: కల్లులో గడ్డి మందు కలుపుకోని తాగాడు

నిజామాబాద్లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.
News March 28, 2025
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.
News March 28, 2025
జగిత్యాల: వరి కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి

రాబోయే యాసంగికి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ కనెక్షన్, ఆన్లైన్ వసతి ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.