News December 4, 2024
ఏలూరు: ప్రేమ పేరుతో మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కేసు
ఏలూరు సత్యనారాయణ పేట చెందిన షాజహాన్ (29) (సాఫ్ట్వేర్ ఉద్యోగి) పై కేసు నమోదైనట్లు సీఐ సత్యనారాయణ బుధవారం తెలిపారు. వారి కథనం పట్టణానికి చెందిన యువతికి (23) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అయితే ఆమెను వద్దని, వారంలో వేరే యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు షాజహాన్ ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Similar News
News January 21, 2025
ప.గో. కోళ్లకు అంతు చిక్కని వైరస్.. లక్షకు పైగా మృతి
కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో లక్షకు పైనే కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. పందెం కోళ్లకు సైతం వైరస్ సోకి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు సాయంత్రానికి మృతి చెందుతున్నాయని చెబుతున్నారు. వైరస్ ప్రభావంతో అమ్మకాలు తగ్గి, ధరలు పతనమవుతున్నాయని అంటున్నారు.
News January 21, 2025
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి మృతి
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్ మృతి చెందాడు. హైదరాబాద్ లో విక్రమ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు చిల్లబోయినపల్లి ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా వెలిమినేడు వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.
News January 21, 2025
ద్వారకాతిరుమల: పిల్లి పిల్లను తల్లిలా సాకుతున్న శునకం
ద్వారకాతిరుమల వసంత్ నగర్ కాలనీలో ఒక శునకం పిల్లి పిల్లను కన్న తల్లిలా సాకుతుండటం అబ్బురరుస్తోంది. తన వెంట తిప్పుకుంటూ ఆడిస్తుండటం ముచ్చట గొలుపుతోంది. అంతేకాదు ఆ పిల్లికి పాలిచ్చి మరీ పెంచుతోంది. కుక్కను చూస్తే ఆమడ దూరం పారిపోయే పిల్లి పిల్ల సైతం శునకంతో కలిసి ఉండటం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ రెండూ నలుపు రంగులో ఉండటంతో అకస్మాత్తుగా వాటిని చూసినవారు నిజంగా అవి తల్లీపిల్ల అని అనుకుంటున్నారు.