News August 19, 2024
ఏలూరు: బాలికలతో అసభ్యప్రవర్తన.. టీచర్ సస్పెండ్

ఏలూరు జిల్లా చింతలపూడి జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.సంపత్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఉపాధ్యాయుడు సంపత్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 8, 9వ తరగతి విద్యార్థులు డీఈవో అబ్రహంకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆయన విచారణకు ఆదేశించారు. విద్యార్థులు చెప్పిన విషయం నిజమేనని తేలడంతో సంపత్ కుమార్ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News November 14, 2025
ఉండి: ‘దివ్యాంగ పిల్లలను ఆదరించాలి’

సమాజంలో ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పిల్లలను ఆదరించాలని సహిత విద్య సమన్వయకర్త టి. శ్రీనివాసరావు అన్నారు. ఉండి నియోజకవర్గం స్థాయిలో ప.గో. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులకు ఆయన అవగాహన కల్పించారు. MEO వినాయకుడు, భవిత కేంద్రం టీచర్ మధు, ఫిజియోథెరపిస్ట్ పాల్గొన్నారు.
News November 13, 2025
తణుకులో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్

తణుకు పట్టణానికి గురువారం ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ వచ్చారు. తణుకులోని పార్వతి సమేత కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆమె సందర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించడంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
News November 13, 2025
భీమవరంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

భీమవరం (M) కొవ్వాడలో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్కు చెందిన హేమవర్షిని (22) భీమవరంలో బీడీఎస్ చదువుతుంది. మంగళవారం తల్లిదండ్రులు ఫోన్ చేసినా తీయలేదు. స్నేహితులు కొవ్వాడలో ఇంటికి వెళ్లికి చూడగా ఉరివేసుకున్నట్లు గుర్తించి తండ్రి సింహాచలం, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.


