News August 31, 2024
ఏలూరు: భారీ వర్షాలు.. ఎంపీ మహేష్ ఆదేశాలు

భారీ వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూశాఖ వారు అన్ని మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేశారన్నారు. అత్యవసర సందర్భాలలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని, నిత్యవసర వస్తువులు తాగునీరు అందుబాటులో ఉంచారన్నారు. ఏదైనా సమస్య వస్తే ఎంపీ కార్యాలయ 98855 19299 నంబర్లో సంప్రదించాలన్నారు.
Similar News
News March 2, 2026
యథావిధిగా జిల్లాలో పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి

భీమవరంలోని కలెక్టరేట్తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టరు నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.
News March 1, 2026
గొల్లలకోడేరు కాదు.. వన్టౌన్ స్టేషన్కు రండి: SP

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలు, ఫిర్యాదులతో నేరుగా వన్టౌన్ స్టేషన్కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.
News March 1, 2026
ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.


