News March 14, 2025

ఏలూరు : భార్యతో గొడవపడి భర్త సూసైడ్

image

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో గురువారం జరిగింది. పవర్ పేట పిల్లా వారి వీధికి చెందిన సుశీల్ (42) బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఉదయం లేచేసరికి ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారమందుకున్న టూటౌన్ సీఐ వైవీ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News March 14, 2026

యాదాద్రి: అక్కది ప్రమాదం కాదు హత్య.. న్యాయం కోసం తమ్ముడి పోరాటం

image

మోత్కూరు (M) పాటిమట్లలో గత నెల 26న జరిగిన కారు ప్రమాదంపై మృతురాలు ఓర్సు వినోద తమ్ముడు క్రాంతి కుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అది ప్రమాదం కాదని, తన బావ రమేశ్ ప్లాన్‌తో చేసిన హత్య అని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారును కావాలనే చెట్టుకు ఢీకొట్టి చంపారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిందితుడికి శిక్ష పడే వరకు పోరాడుతానని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

News March 14, 2026

పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

జంగేడు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం తనిఖీ చేశారు. పరీక్షా నిర్వహణ తీరు, కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షా హాళ్లను సందర్శించి, విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News March 14, 2026

మొదటి రోజు 99.9 శాతం హాజరు: డీఈవో

image

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 99.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రంగయ్య వెల్లడించారు.