News August 18, 2024
ఏలూరు: మతిస్థిమితం లేని బాలికను గర్భవతిని చేసి..

మతిస్థిమితం లేని 15ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి లోబర్చుకొని గర్భవతిని చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. 2రోజుల క్రితం కడుపునొప్పి రాగా కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి 7వ నెల గర్భిణి అని చెప్పారు. బాలిక తల్లి ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 8, 2026
ప.గో: యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.
News January 8, 2026
నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 8, 2026
నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.


