News March 18, 2025
ఏలూరు: మహిళపై అత్యాచారం

తనకు న్యాయం చేయాలని అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయింది.
Similar News
News March 18, 2025
సూపర్ స్టైలిష్గా మెగాస్టార్.. లుక్ చూశారా?

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా నుంచి తాజాగా రిలీజైన స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి యంగ్గా, స్టైలిష్గా కనిపిస్తున్నారు. లుక్ సూపర్గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని, ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.
News March 18, 2025
HNK: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా ఎస్సీ అధ్యయన కేంద్రం విద్యార్థులు

తెలంగాణ షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రం HNKకు చెందిన విద్యార్థులు పి.ప్రవీణ్, జి.శిరీష హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా సెలెక్ట్ ఐనట్లు SC అధ్యయన కేంద్రం సంచాలకులు Dr.K.జగన్మోహన్ తెలిపారు. వీరికి తెలంగాణ షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రం చైర్పర్సన్ & జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఏ.శ్రీలత అభినందనలు తెలిపారు.
News March 18, 2025
వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.