News March 18, 2025

ఏలూరు: మహిళపై అత్యాచారం

image

తనకు న్యాయం చేయాలని అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయింది.

Similar News

News December 24, 2025

నల్గొండ: ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు ఇస్తా: సర్పంచ్

image

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేమిల్లగూడెం నూతన సర్పంచ్ ఏరెడ్ల నారాయణరెడ్డి తన సొంత ఖర్చుతో ఊరిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు తన పదవీకాలం ముగిసే వరకు రూ.5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పుట్టిందని దిగులు చెందొద్దని, మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టిందని గర్వంగా చెప్పుకోవాలన్నారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నేటి యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు.

News December 24, 2025

సత్యసాయి జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

image

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, క్రైస్తవ సోదరులు ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. జిల్లాలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

News December 24, 2025

ప్రమాదాల్లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాను వచ్చే ఏడాది రహదారి ప్రమాదాల్లేని జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు.